AP Weather Updates: ఏపీలో రేపు మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజంగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4°C లు, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 46.2°Cలు, కృష్ణా జిల్లా కోడూరులో 46°C లు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. మిగిలిన చోట్ల కూడా ఎండ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రయాణాల్లో ఉన్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల జాబితాలో గుంటూరు జిల్లా దుగ్గిరాల ,కొల్లిపర , మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడకండ, త్తళ్ళూరు, కృష్ణో జిల్లా పెనమలూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు. 


వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల జాబితా విషయానికొస్తే.. అల్లురి జిల్లాలో 5 మండలాలు, బాపట్ల జిల్లాలో 18 మండలాలు, తూర్పు గోదావరి జిల్లాలో 19 మండలాలు, ఏలూరు జిల్లాలో 28 మండలాలు, గుంటూరు జిల్లాలో 8 మండలాలు, కాకినాడ 8 మండలాలు, కోనసీమ జిల్లాలో 9 మండలాలు, కృష్ణా జిల్లాలో 15 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 14 మండలాలు, పల్నాడు జిల్లాలో 23 మండలాలు, మన్నెం జిల్లాలో 8 మండలాలు, ప్రకాశం జిల్లాలో 6 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలో 1 మండలం, నెల్లురు జిల్లాలో 7 మండలాలు, విజయనగరం జిల్లాలో 2 మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని 11 మండలాలు, వైఎస్సార్ కడప జిల్లాలో 12 మండలాల్లో వడగాలుులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజంగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు.


రేపు శ్రీకాకుళం, విజయనగరం పార్వతీపురం, మనేం, అల్లురి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,  పల్నాడు, ప్రకాశం జిల్లా, SPSR నెల్లురు, తిరుపతి జల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 48°C ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.


విశాఖ పట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C నుంచి 44°Cల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాలో 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సోమవార్ం 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు , 131 మండలాల్లో వడగాల్పులు వీచాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజంగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ స్పష్టంచేశారు. రాబోయే వారం, పది రోజులు ఎండలు దంచికొట్టనున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే పలుసార్లు జనాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.