అమరావతి: ఎన్నికల సరళిని పరిశించిన చంద్రబాబు..తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి తమ పార్టీకి 130 కి తగ్గవని చెప్పిన చంద్రబాబు..మరో అడుగు ముందకేసి మే 23 తర్వాత మంచి రోజు చూసుకొని ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు. ఈ గెలుపు విషయంలో  ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదంటూ తన కాన్ఫిడెన్స్ మరోమారు ప్రదర్శించారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రీ పోలింగ్ పై రేపు ఈసీతో భేటీ


ఇదే సందర్భంలో ఈవీఎంల పనితీరుపై  చంద్రబాబు అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈవీఎలం పరిస్థితి చూస్తుంటే తన ఓటు కోరుకున్న పార్టీకే పడిందా ? లేక వేరే పార్టీకి పోయిందా? అనే పరిస్థితి నెలకొందని..వాస్తవానికి తన ఓటు విషయంలోనూ ఇదే సందేహం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 159 పోలింగ్ కేంద్రాల్లో రీకౌంటింగ్ నిర్వహించాలనే అంశంపై రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తానని  చంద్రబాబు పేర్కొన్నారు.