గుంటూరు: ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్న సీఐ బాగోతం వెలుగుచూడటంతో పోలీసు ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేసిన ఘటన తాజాగా గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. నగరంపాలెం సీఐ వెంకట్ రెడ్డి తనను మోసం చేశారని పేర్కొంటూ బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సదరు మహిళ చేసిన ఫిర్యాదు గురించి తెలుసుకున్న ఐజి.. సీఐ వెంకట్ రెడ్డిపై విచారణకు ఆదేశించారు. పోలీసుల విచారణలో వెంకట్ రెడ్డిపై ఆ మహిళ చేసిన ఆరోపణలు నిజమేనని తేలడంతో అతడిని విధుల నుంచి తప్పిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల కాలంలో ఇదే గుంటూరు జిల్లాలో ఈ తరహా కేసుల్లో పోలీసులు సస్పెండ్ అవడం ఇది మూడోసారి. 


మహిళలను మోసం చేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణల్లో ఇటీవలే గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎస్సైలు సస్పెండ్ అయ్యారు. తాజాగా అటువంటి ఘటనలోనే మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళలను రక్షించాల్సిన పోలీసులే మహిళలను మోసం చేసి సస్పెన్షన్లకు గురవుతున్న తీరు చూస్తోంటే.. ఈ తరహా ఘటనలతో పోలీసు శాఖ ప్రతిష్ట మసకబారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..