హైదరాబాద్: ప్రముఖ నటుడు అలీ సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో అలీకి వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా అలీ లోటస్‌పాండ్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు. ''వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరని, పాద యాత్ర తర్వాత ఆయనకు భారీ స్థాయిలో ఆదరణ పెరగడమే కాకుండా జగన్ వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందని జనం కోరుకుంటున్నారు'' అని అలీ అభిప్రాయపడ్డారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే తన ధ్యేయం అని అలీ స్పష్టంచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


రాజమండ్రికి చెందిన అక్కడి నుంచి కానీ లేదా విజయవాడ నుంచి కాని అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధంగా వున్నారనే టాక్ వినిపించినప్పటికీ.. అలీ మాత్రం తాని పోటీ చేయాలని అనుకోవడం లేదని, అయితే, ఎన్నికల ప్రచారంలో మాత్రం తప్పకుండా పాల్గొంటానని తేల్చిచెప్పారు.