COVID19 Cases In AP | ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 961 మందికి కరోనా సోకగా, మిగతా 37 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (Andhra Pradesh CoronaVirus Cases) 18,697కు చేరుకున్నాయి. కరోనా శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. బాధ్యత ఉండక్కర్లేదా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 8,422 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 10,043 కోవిడ్19(COVID-19) యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 14 మంది వ్యక్తులు కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 232కి చేరింది. బిల్లు గురించి ప్రశ్నిస్తే.. హైదరాబాద్‌లో మహిళా డాక్టర్‌ నిర్భందం


తాజాగా కర్నూలు జిల్లాలో అయిదుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు, విశాఖ జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 20,567 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 998 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 391 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos 


నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 10,17,140 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 16,102 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,179 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 416 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు జులై 5న మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!