AP CoronaVirus Cases | ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజులుగా రికవరీ కేసుల రేటు క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 845 కరోనా పాజిటివ్ కేసులు(CoronaVirus) నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 812 మందికి కరోనా సోకగా, మిగతా 33 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP COVID19 Cases) 16,097కు చేరుకున్నాయి. GVK గ్రూప్ చైర్మన్‌పై సీబీఐ కేసు.. వందల కోట్ల చీటింగ్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకుగాను 7,313 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 8,586 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో అయిదుగురు వ్యక్తులు కరోనాతో పోరుడుతూ మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 198కి చేరింది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos


ఏపీలో గడిచిన 24 గంటల్లో 14,285 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 845 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 281 మంది ప్రాణాంతక కోవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒక్కరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, అనంతపురంలో ఒక్కరు కరోనా బారిన పడి చనిపోయారు. ఘోరం.. కొండచరియలు విరిగిపడి 50మంది దుర్మరణం
[[{"fid":"187099","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/@ArogyaAndhra","field_file_image_title_text[und][0][value]":"జులై 2 నాటికి ఏపీలో కరోనా కేసులు, వివరాలు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/@ArogyaAndhra","field_file_image_title_text[und][0][value]":"జులై 2 నాటికి ఏపీలో కరోనా కేసులు, వివరాలు"}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: twitter/@ArogyaAndhra","title":"జులై 2 నాటికి ఏపీలో కరోనా కేసులు, వివరాలు","class":"media-element file-default","data-delta":"1"}}]]


COVID19 Cases In Andhra Pradesh | నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 9,32,713 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 13,625 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,065 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 407 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు జులై 2న మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!