ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కలకలం రేగింది. అమరావతిలో ఉన్న సచివాలయంలోకి కరోనా ప్రవేశించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కలకలం..!!
ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ..!
భయాందోళనలో మిగతా ఉద్యోగులు..!


అమరావతి సచివాలయంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ నుంచి కొంత మంది సచివాలయం ఉద్యోగులు ప్రత్యేక బస్సులలో అమరావతి చేరుకున్నారు. అమరావతి చేరుకున్న తర్వాత అందరికీ కరోనా పరీక్షలు చేశారు. ఐతే  అందులో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  దీంతో ఒక్కసారిగా అమరావతి సెక్రటేరియట్ లో కలకలం రేగింది. దీంతో ఉద్యోగులంతా భయాందోళనకు  గురవుతున్నారు.


మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఉద్యోగితో గత రెండు రోజులుగా ఉన్న ఉద్యోగులు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని సచివాలయ ఉద్యోగ సంఘం విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ ఉద్యోగులందరికీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమాచారం ఇచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..