AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి . కొత్తగా 122 మందికి పాజిటివ్​గా (Corona cases in AP) వచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం ఉదయం 10 గంటల వరకు 18,788 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా ఒకరు మరణించినట్లు ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. కృష్ణా జిల్లాలో ఈ మరణం సంభవించినట్లు తెలిపింది.


ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 213 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ.


ఇక ఇప్పటి వరకు మొత్తం 3,05,88,808 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 20,70,957 శాంపిళ్లు పాజిటివ్​గా తెలినట్లు వివరించింది. ఇక ఇప్పటి వరకు 20,54,474 మంది కరోనాను జయించగా.. 14,453 మంది కొవిడ్​కు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,030 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.



మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.


ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు ఇప్పటికే దేశంలో నమోదైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని వివిధ ఎయిర్​పోర్ట్​లలో ప్రయాణికులకు ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తోంది. వారం రోజుల క్వారంటైన్ నిబంధన విధిస్తోంది.


Also read: AP New Capital: ఏపీ నూతన రాజధానిగా విశాఖ, ప్రకటన ఎప్పుడంటే..


Also read: Omicron Variant: పొరుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు, అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook