Dead Body In MLC Car: ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఉండటం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ కారులో డెడ్ బాడీ ఉండటం సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం ఉంది. డెడ్ బాడీ ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రమణ్యానిదిగా గుర్తించారు.  అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పారు. ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి సమాచారం ఇచ్చారు డెడ్ బాడీని అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కారులో తీసుకొచ్చారు ఎమ్మెల్సీ అనంతబాబు. అయితే మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో డెడ్ బాడీ ఉన్న కారు అక్కడే వదిలి మరో కారులో వెళ్లిపోయారు మ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎమ్మెల్సీ డ్రైవర్ చనిపోవడం.. ఎమ్మెల్సీనే డెడ్ బాడీని తన కారులో తీసుకుని రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తన కొడుకును గురువారం ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ తీసుకెళ్లారని సుబ్రమణ్యం తల్లిదండ్రులు చెబుతున్నారు. తన కొడుకును హత్య చేశారని ఆరోపిస్తున్నారు. కొట్టి చంపి ప్రమాదంగా చెబుతున్నారని అంటున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. డెడ్ బాడీని ఎమ్మెల్సీ ఇంటికి ఎలా తీసుకువస్తారని ప్రశ్నిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ దగ్గర సుబ్రమణ్యం డ్రైవర్ గా పని చేస్తున్నారని బంధువులు చెప్పారు.


READ ALSO: Pawan Kalyan: నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన.. తెలంగాణ రాజకీయాల్లో కాక


READ ALSO: Jr NTR fans:జూనియర్ ఎన్టీఆర్ ఇంటిదగ్గర అభిమానుల రచ్చ.. పోలీసుల లాఠీఛార్జ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook