కర్నూలు: హొళగుంద మండల పరిధిలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాల్లో భాగంగా ప్రతీ ఏడాది దసరా నాడు ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు 8 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకుంటారనే ఆనవాయితీ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా దేవరగట్టు కర్రల సమరంలో భారీ ఎత్తున హింస చోటుచేసుకుంది. ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు రెండు వర్గాలుగా విడిపోయిన వేలాది మంది కర్రలతో కొట్టుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"180049","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఆనవాయితీ పేరుతో జరిగిన ఈ ఉత్సవంలో 70 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట కొండ ప్రాంతం ఈ కర్రల సమరానికి వేదికైంది. కర్రల సమరం నియంత్రించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయని సమాచారం.