Dussehra Special Trains: దసరా పండుగ వచ్చిందంటే చాలు బస్సులు, రైళ్లు రద్దీగా మారిపోతాయి. అందుకే పండుగ వేళ ఈస్ట్ కోస్ట్ రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఆ రైళ్ల వివరాలంటే తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దసరా ప్రారంభమైపోయింది. బంధువుల ఇళ్లకు వెళ్లేవారితో రైళ్లు, బస్సులు బిజిగా ఉంటున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే(East Coast Railway) ప్రత్యేక పూజా స్పెషల్ రైళ్లను ప్రవేశపెట్టింది. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య 08579 నెంబర్‌తో వీక్లీ ట్రైన్ అక్టోబర్ 13, 20, 27 తేదీల్లో నడవనుంది. ఈ రైలు విశాఖపట్నంలో రాత్రి 7 గంటలకు బయలుదేరి ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదే రైలు 08580 నెంబర్‌తో అక్టోబర్ 14, 21, 28 తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 7 గంటల 40 నిమిషాలకు బయలుదేరి..ఉదయం 6 గంటల 40 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది.


ఇక విశాఖపట్నం-తిరుపతి(Visakhapatnam-Tirupati Special Pooja Train)మధ్య వీక్లీగా అక్టోబర్ 8, 25, నవంబర్ 1 తేదీల్లో మరో ట్రైన్ ప్రవేశపెట్టింది. ఈ రైలు విశాఖపట్నంలో రాత్రి 7 గంటల 15 నిమిషాలకు బయలు దేరి ఉదయం 7 గంటల 30 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. అదే రైలు 08584 నెంబర్‌తో తిరుపతిలో అక్టోబర్ 19, 26, నవంబర్ 2 తేదీల్లో రాత్రి 9 గంటల 55 నిమిషాలకు బయలుదేరి..ఉదయం 10 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక విశాఖపట్నం-సికింద్రాబాద్(Visakhapatnam-Secunderabad Special Pooja Train)మధ్య 08585 స్పెషల్ నడవనుంది.ఈ రైలు విశాఖపట్నంలో అక్టోబర్ 19, 26, నవంబర్ 2 తేదీల్లో సాయంత్రం 5.35 నిమిషాలకు బయలుదేరి ఉదయం 7 గంటల 10 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదే రైలు సికింద్రాబాద్ నుంచి 08586 నెంబర్‌తో అక్టోబర్ 20,27 నవంబర్ 3 తేదీల్లో రాత్రి 9 గంటల 5 నిమిషాలకు బయలుదేరుతుంది. 


Also read: AP Corona Update: ఏపీలో కరోనా సంక్రమణ, గత 24 గంటల్లో కొత్తగా 629 కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook