రైలులో ప్రారంభమైన ప్రేమ ప్రయాణానికి పెళ్లితో బ్రేక్‌ వేద్దామనుకుంది ఓ యువతి. అయితే పెళ్లి ప్రపోజల్ రాగానే ప్రియుడు ముఖం చాటేయడం మొదలెట్టాడు. దీంతో ప్రియుడి మెడలు వంచి తన మెడలో తాళికట్టించుకోవాలని డిసైడ్ అయింది ఆ యువతి.. అతని ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్లినట్లయితే.. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన పవన్ అనే యుకువడు.. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన యువతికి మూడేళ్ల క్రితం ఓ రైలు ప్రయాణంలో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. అప్పటి నుంచి వీరి ప్రేమ రైలు పరిగెడుతూనే ఉంది...సరిగ్గా పది నెలల తర్వాత సదురు యువతి పవన్‌ వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చింది. దీనికి ససేమిరా అన్న యువకుడు ఏవో సాకులు చెప్పుకొచ్చాడు... అయినా యువతి పెళ్లికి ఒత్తిడి చేయడంతో తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. 


ప్రియుడు వ్యక్తిగతంగా కలవకపోవడమే కాకుండా... ఫోన్‌కి స్పందించక పోవడంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆ యువతి సిద్ధమైంది. పవన్‌ స్వగ్రామం పత్తికొండకు వచ్చి విషయాన్ని పెద్దల వద్ద పంచాయితీ పెట్టింది..దీనికి పవన్‌ ఆ యువతితో పెళ్లికి అంగీకరించకపోవడంతో అతని ఇంటి ముందు బైఠాయించి మౌనపోరాటానికి దిగింది. తనకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తానంటోంది యువతి.