AP Grama Volunteers 2020  | ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయ సిబ్బందికి సంబంధించిన భర్తీని నెలకు ఒకసారి చేయాలి అని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తామని తెలిపింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం


విలేజ్, వార్డ్ సెక్రటేరియట్ కమిషనర్ నవీన్ కుమార్ ఈ మేరకు జాయింట్ కలెక్టర్స్ నోటీసులు జారీ చేశారు. ప్రతీ నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యలో గ్రామ సచివాలయ (Village Volunteers Recruitment)   సిబ్బంది భర్తీని పూర్తి చేయాలి అని సూచించారు.


అదే సమయంలో MPDOలు, మున్సిపల్ కమిషనర్స్‌కు కూడా ఈ మేరకు పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను జాయింట్ కలెక్టర్స్‌కు అందిస్తూ ఉండాలి అని సూచించారు. ఇందులో అలసత్వం చూపించరాదు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) వ్యాప్తంగా మొత్తం 2లక్షల 60 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రస్తుతం 7,120 అభ్యర్థులను భర్తీ చేస్తున్నారు. ఇందులో 5,154 మంది విలేజ్ వాలంటీర్లు కాగా, 1,966 వార్డు వాలంటీర్లు ఉన్నారు.



Also Read | Rythu Bandhu: త్వరలో మరో విడత రైతు బంధు ప్రారంభం 


మరోవైపు 35 ఏళ్లకన్నా ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థులతో పాటు, అసత్య ప్రచారాలు, ప్రాపగాండలు నడిపిస్తున్న వాలంటీర్లను తొలగించే ప్రక్రియ కూడా మొదలైంది. అలాంటి విషయాలను నమ్మవద్దు అని అధికారులు కోరారు. ఇప్పటి వరకు ఆరు మందిని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోనున్నారు అని తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook