కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా అహోబిలంలో భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ  సందర్భంలో ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్, చెల్లి మౌనికకు గాయాలైనట్లు సమాచారం. తాజా ఘర్షణ వాతావరణంతో ఓటు వేసేందుకు వచ్చిన జనాలు భయాందోళనలు గురయ్యారు. 
 


ఈ ఘర్షణ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు..ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. నిర్భయంగా ఓటు వేయవచ్చని పోలీసులు అభయమిచ్చారు. ఘర్షణ  సమాచారం అందుకున్న అఖిలప్రియ హుటాహుటిన అహోబిలం చేరుకున్నారు.