వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. మొత్తం ఆరు నెలల పాటు సాగే ఈ యాత్ర ఇడుపులపాయ వైఎస్ఆర్ సమాధి నుంచి ప్రారంభమై.. శ్రీకాళకుం జిల్లా ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది. మంగళవారం అంతరంపురం లో జరిగిన వైసీపీ యువభేరిలో వైసీపీ అధినేత జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ... ఆరునెలల పాటు సాగే ఈ పాదయాత్రలో ఎక్కడికక్కడ జనంతో మమేకమవుతూ...రాష్ట్రంలో సాగుతున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి అందరికీ వివరిస్తానని వెల్లడించారు. పాదయాత్రలో ప్రత్యేక హోదా గురించి ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగడతామని జగన్ పేర్కొన్నారు.