రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించాలని భావిస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా గతంలో చెప్పినట్లుగా జనసేన తొలి పార్టీ ఆఫీసు అనంతపురంలో ఏర్పాటు చేస్తామని పవన్ ప్రకటించారు. గుత్తి రోడ్డులో రెండెక‌రాల విస్తీర్ణంలో కార్యాల‌యం ఏర్పాటు కాబోతుంద‌ని పవన్ తెలిపారు. తన పార్టీ ఆఫీస్ విజ్ఞాన భాండాగారం తీర్చిదిద్దుతానని..అది మేథావుల చర్చలకు కేంద్రంగా తీర్చిదిద్దుతానని  వెల్లడించారు. గత ఏడాది న‌వంబ‌ర్ 10న అనంత‌పురంలో జ‌రిగిన జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌లో పవన్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ తొలి కార్యాల‌యాన్ని ఏర్పాటు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అది నెరవేర్చే క్రమంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.