జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన పర్యటన సంబంధించిన కీలక ప్రకటన చేశారు. తాను ఏపీ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్యటిస్తానని చెప్పుకొచ్చారు. తెలుగురాష్ట్రాల్లో యువత నిరాశతో ఉందని.. యువతను జాగృతం చేసేందుకు 'చ‌లో రే చ‌లో' పేరుతో పర్యటన చేస్తున్నానని వెల్లడించారు. దీనికి సంబంధించిన గీతాన్ని కూడా రెడీ చేసుకున్నారు పవన్ కల్యాణ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు దశల్లో పర్యటన..


తన పర్యటన గురించి పవన్ మాట్లాడుతూ ...తను మూడు దశల్లో పర్యటన చేస్తానని చెప్పుకొచ్చారు. మొదటి దశలో సమస్యల పరిశీలన, అధ్యయనం, అవగాహన చేస్తానని .. రెండో విడత లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతానని వెల్లడించారు. ఇక మూడో దశలో సమస్యలు పరిష్కరించని పక్షంలో పోరాటాల వేదికగా పర్యటన ఉంటుందని  పవన్ కల్యాణ్ తెలిపారు.