భారత ప్రధాని నరేంద్రమోదీపై సంచలన వ్యాఖలు చేశాడు కత్తిమహేశ్. రూ. 500, 1000 నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో ప్రజలందరికీ ఫలాలు అందకపోతే.. తనను కాల్చేయండని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారని సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ గుర్తు చేశారు. అనంతపురంలో మంగళవారం నిర్వహించిన రాజ్యంగ పరిరక్షణ సభలో కత్తి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.


50 రోజులు కాదుకదా.. నేటికీ దేశ ప్రజలకు ఎలాంటి ఫలాలు అందకపోగా.. ఈ నోట్ల రద్దు వ్యవహారంలో ఎందరో సామాన్యులు బలయ్యారని అన్నారు. దీనికి కారణమైన ప్రధానమంత్రి మోదీని నడి రోడ్డుపై కాల్చేయాలన్నారు. మోసాలు, అబద్ధాలు, ద్రోహానికి చిరునామాగా మోదీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. మనల్ని కాపాడుతున్న రాజ్యాంగాన్ని మనమే రక్షించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మతోన్మాద శక్తులు రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను తుంగలో తొక్కేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు.