లాక్‌డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లడానికి సౌకర్యాన్ని కల్పిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. జూన్ 1 నుంచి దేశ వ్యాప్తంగా 200 రోజువారీ రైలు సర్వీసులను అందించేందుకు సిద్ధంగా ఉంది. నేటి (మే 21) నుంచి ఆ రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభిస్తామని రైల్వేశాఖ తెలిపింది. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లు ఉండవు.  హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తొలుత స్లీపర్ బోగీలలో రిజర్వేషన్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత వెయిటింగ్ లిస్ట్ టికెట్లు 200 మేర జారీ చేయనున్నారు. రైళ్లలో గతంలో ఉన్నట్లుగానే జనరల్, ఏసీ బోగీలుంటాయి. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న రైళ్ల వివరాలు వచ్చేశాయి.  Photos: 36-24-36తో సెగలు రేపుతోన్న అందం


ఏపీ, తెలంగాణలకు నడిచే రైళ్ల వివరాలు


  • హైదరాబాద్ - న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (02723/02723 )

  • ముంబయి - హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ (02701/02702)

  • దానాపూర్ - సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (02791/02792)

  • హావ్‌డా - సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (02703/02704)

  •  గుంటూరు - సికింద్రాబాద్ గోల్కోండ ఎక్స్‌ప్రెస్ (07201/07202)

  • తిరుపతి - నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (02793/02794)

  • హైదరాబాద్ - విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (02727/02728)

  • విశాఖపట్నం - ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (02805/02806)

  • ముంబయి సీఎస్‌టీ - భువనేశ్వర్ (సికింద్రాబాద్, విజయవాడ మీదుగా) కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (01019/01020)


----------------------------


వారానికి రెండుసార్లు సర్వీస్: సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ (02285/02286)


వారానికి 5 రోజులు: హావ్‌డా - యశ్వంత్‌పూర్ (విజయవాడ మీదుగా) దురంతో ఎక్స్‌ప్రెస్ (02245/02246)   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్