Cyclone Michaung Live Updates: బాపట్లలో తీరాన్ని తాకిన మిచౌంగ్ తుపాను.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Tue, 05 Dec 2023-6:13 pm,

Cyclone Michaung Update Live Tracker: మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో విమనాలు, రైళ్లు రద్దు అయ్యాయి. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మిచౌంగ్ తుపాను లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

Cyclone Michaung Update Live Tracker: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో చెన్నైకు 170 కిలోమీటర్లు, బాపట్లకు 150, మచిలీపట్నానికి 210 కిలోమీటర్ల దూరంలో మిచౌంగ్  తుపాను కేంద్రీకృతమై ఉంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తీరం వైపునకు వస్తోంది. మంగళవారం మధ్యాహ్ననికి బాపట్ల వద్దే తీరం దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. చెన్నైలో వరదనీరు వీధుల గుండా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్‌తో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్ తుపాను లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

Latest Updates

  • Michaung Cyclone Live Updates: తీరం దాటిన  తీవ్ర తుఫాను మిచౌంగ్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటిన తీవ్రతుఫాన్

    ==> తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు

    ==> రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడనున్న తీవ్రతుఫాన్ 

    ==> తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డా.బీఆర్ అంబేద్కర్, మేనేజింగ్  డైరెక్టర్, విపత్తుల సంస్థ.

  • Michaung Cyclone Live Updates: అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు పరిధిలో అరటి పంటలు దెబ్బతిన్నాయి. పుల్లంపేట, ఓబులవారిపల్లి, రైల్వే కోడూరులో అరటి పంటలు ధ్వంసమయ్యాయి. అరటి పంటను కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే శ్రీనివాసులు పరిశీలిచారు.
     

  • Michaung Cyclone Live Updates: మిచౌంగ్ తుపాను తీవ్ర దాటుతున్న సమయంలో రాకసి అలలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బాపట్ల, కాకినాడ, మచిలీపట్నం తీరాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.

  • Michaung Cyclone Live Updates: ఏపీలో తుపాను బీభత్సం 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> బాపట్ల దగ్గర తీరాన్ని తాకిన తుపాను 

    ==> మరో 2 గంటల్లో తీరం దాటనున్న మిచౌంగ్‌ తుఫాన్‌ 

    ==> తీరం వెంబడి గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు 

    ==> కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు 

    ==> 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ 

  • Michaung Cyclone Live Updates: బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపల్లె నియోజకవర్గంలో  వర్షం  కారణంగా దెబ్బతిన్న పొలాలను స్వయంగా తానే వెళ్లి పరిశీలించారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు. 

  • Michaung Cyclone Live Updates: తీర ప్రాంత ఎమ్మెల్యేలతో వైసీపీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జి కేళ్ల అప్పిరెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించామని అన్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు  నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాల్సిన సమయంలోనూ సహకరిస్తారని.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం తమ ధర్మమని చెప్పారు. రైతులు ఎవరూ భయపడాల్సిన పనిలేదని.. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం జగన్ చెప్పారని గుర్తుచేశారు. 

  • Michaung Cyclone Live Updates: మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి  పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల, జిల్లా స్థాయి నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. తుపాన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బీజేపీ నేతలు అన్ని విధాలుగా అండగా నిలవాలన్నారు. సహాయక చర్యల్లో బీజేపీ శ్రేణులు విస్తృతంగా పాల్గొనాలన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. విపత్తు ప్రభావం వల్ల జరిగే నష్టం అంచనాలను, ఇతర విషయాలు వెంటనే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాలన్నారు. 
     

  • Michaung Cyclone Live Updates: తెలంగాణ ఈశాన్య జిల్లాలపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం చూపనుంది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి, ములుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, నల్గొండ, యాదాద్రి, జయశంకర్, సిద్దిపేట, నాగర్ కర్నూల్, మేడ్చల్, వనపర్తి, నారాయణపేట, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఉరుములు మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.

  • Michaung Cyclone Live Updates: బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప.గో ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్

    ==> నెల్లూరు, కడప, తూ.గో., కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
    ==> ఏపీలో మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.
    ==> తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళానికి ఎల్లో అలర్ట్.. 

  • Michaung Cyclone Live Updates: చెన్నై విమానాశ్రయంలో విమానాలు నిలిపి ఉంచే  ప్రాంతాలు, రన్‌వేలో భారీ వర్షపు నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయం సోమవారం రాత్రి 11:00 గంటల వరకు తాత్కాలికంగా మూసివేశారు. గల్ఫ్ దేశాలతో సహా ప్రపంచం నలుమూలల నుంచి చెన్నై వెళ్లాల్సిన విమానాలను బెంగళూరుకు మళ్లించారు.
     

  • Michaung Cyclone Live Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ వద్ద మిచౌంగ్ తుపాను కేంద్రీకృతమై ఉంది. గత 6 గంటల్లో  గంటకు 12 కి.మి వేగంతో ఉత్తరం వైపు కదులుతూ ఈరోజు ఉదయం 08 గంటల సమయానికి అదే ప్రాంతంలో  ఆక్షాంశం 15.2°N, రేఖాంశం 80.25°E దగ్గర కావలికి ఈశాన్యంగా 40 కి.మీ, నెల్లూరుకు 80 కి.మీ ఉత్తర-ఈశాన్యంగా, నైరుతి 110 కి.మీ. బాపట్లకి 80 కి.మీ దక్షిణ-నైరుతి దిశలో, మచిలీపట్నానికి దక్షిణ-నైరుతి దిశలో 140 కి.మీ.దూరములో కొనసాగుతోంది.

    ఉత్తరం వైపుగా తీరానికి దగ్గరగా కదులుతున్నందున వాల్ క్లౌడ్ ప్రాంతంలోని కొన్ని భాగాలు భూమిపై కొనసాగుతాయి. ఈ వ్యవస్థ ఉత్తరం వైపుకు సమాంతరంగా, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా.. బాపట్లకు దగ్గరగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం దాటి వచ్చే 4 గంటల్లో తీవ్రమైన తుపానుగా మారుతుందని అధికారులు తెలిపారు. గరిష్టంగా గంటకు 90-100 కి.మీ వేగంతో 110 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. 

  • Cyclone Michaung Live Updates: భారీ వర్షాలకు ఏర్పేడు మండలం జంగాలపల్లి మిగులు వాగు వంతెన దెబ్బతింది.

  • Cyclone Michaung Live Updates: హైదరాబాద్‌ నుంచి దక్షిణాదికి వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. ఇప్పటికే 150కిపైగా రైళ్లను దక్షిణమధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. రద్దయిన వివరాల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామని అధికారులు తెలిపారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని ప్రజలకు సూచించారు.

  • Cyclone Michaung Live Updates: వరద బాధితులకు అండగా నిలుస్తూ.. అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఏ అవసరం వచ్చినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. పూలవాని గుంట, గొల్లవాని గుంట ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాలకు తరలించిన వారితో పాటు పునరావాస కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉన్నా సరే అలాంటి వారికి  ఆహార పానియాలను అందజేయాలని తహశీల్దార్ వెంకట రమణను ఆదేశించారు.

  • Cyclone Michaung Live Updates: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మిచౌంగ్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> ప్రస్తుతానికి నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో తుఫాన్

    ==> మధ్యాహ్నంలోపు బాపట్ల దగ్గరలో తీవ్ర తుపానుగా తీరం దాటనున్న మిచౌంగ్

    ==> తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు

    ==> ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి: డా.బీఆర్ అంబేద్కర్, మేనేజింగ్  డైరెక్టర్, విపత్తుల సంస్థ.

  • Cyclone Michaung Live Updates: విశాఖ నుంచి వెళ్లాల్సిన 23 విమానాలను అధికారులు రద్దు చేశారు. విశాఖ ఆర్కే బీచ్ మూసివేశారు. ఇవాళ, రేపు ఎవరు బీచ్‌కు రావద్దంటూ పోలీసులు హెచ్చరిక చేశారు.

  • Cyclone Michaung Live Updates: తిరుపతి జిల్లా ఎర్రవారి పాలెం మండలం బోడెవాళ్లపల్లి గ్రామంలో తుపాను ప్రభావంతో  పంటలు బాగా దెబ్బతిన్నాయి. తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.  
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link