Mekapati Goutham Reddy Funeral: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి (50) ఇటీవలే గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అకాల మరణం పలువురు రాజకీయ నాయకులను షాక్ కు గురిచేసింది. సోమవారం (ఫిబ్రవరి 21) ఉదయం జిమ్ కు వెళ్లే ముందు ఆయనకు గుండెపోటుకు గురయ్యి.. సోఫాలో కుప్పకూలిపోయారు. ఆ తర్వాత వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెల్లూరులోని గౌతమ్ రెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి చేరుకుంది. అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి మేకపాటి గౌతమ్ రెడ్డి బంధువులు, సన్నిహితులు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అంతిమయాత్రలో దారి పొడవునా.. గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు.  


ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వం లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. గంధపు చెక్కలతో మంత్రి గౌతమ్ రెడ్డి దహన సంస్కారాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సహా వైసీపీ నాయకులు హాజరయ్యారు.   


Also Read: Mekapati Goutham Reddy Funeral: ఎయిర్ అంబులెన్స్ లో నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం!


Also Read: Goutham Reddy Death: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు ఇంట్లోనే పోయాయా..ఆ రెండు గంటలు ఏం జరిగింది ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook