హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సెక్యూలరీజంపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.  2002లో గుజరాత్ అల్లర్లు జరగుతున్నప్పుడు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు..అప్పుడు సెక్యూలరిజంపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో ఎంతో మంది అమాయక ముస్లింలు ఎన్ కౌంటర్లకు గురయ్యారని..అప్పుడు చంద్రబాబు స్వరం వినిపించలేదన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు సెక్యూలరిజం పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఓవైసీ దయ్యబట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల వ్యూహంలో భాగమేనా ?


తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పోటీ చేసే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులను మహాకూటమి బరిలోకి దించుతున్నందున అసదుద్దీన్ ఈ కౌంటర్ ఎటాక్ ప్రారంభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగానే చంద్రబాబుపై అసదుద్దీన్ ఈ మేరకు విమర్శలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి