అమరావతి: పవన్ కల్యాణ్ సమక్షంలో మెగా బ్రదర్ నాగబాబు ఈ రోజు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీలో అంకిత భావంతో ఓ సాధారణ కార్యకర్తల కష్టపడతాని వెల్లడించారు.  పార్టీలో చేరకముందే ఎలాంటి బాధ్యత అప్పగించినా పనిచేసేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. జనసేన కార్యాలయంలో తనకు క్లీనింగ్ పని ఇచ్చినా చేసేందుకు సిద్ధమయ్యానని  కానీ తనకు నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా నిలబెట్టి పవన్ గొప్ప గౌరవం ఇచ్చారని నాగబాబు పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తనకు తమ్ముుడు కాదని.. అందరు కార్యకర్తల్లానే ఆయన తనకు నాయకుడని నాగబాబు చమత్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్ననాటి నుంచి పవన్ అంతే...


ఈ సందర్భంగా పవన్ గురించి నాగబాబు పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. పవన్ గురించి జనసేన కార్యకర్తల కంటే తనకే ఎక్కువ తెలుసని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. తాను చిన్నప్పటి నుంచి చూశాననీ.. ఆయన ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండేవారని తెలిపారు. అలాంటప్పుడు ‘ఏం చేస్తున్నావ్ కల్యాణ్?’ అని ఇంట్లో ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పేవాడు కాదన్నారు. పవన్ చిన్నతనం నుంచి సమాజ సమస్యలపై తీవ్రంగా స్పందించే రకమని నాగబాబు కొనియాడారు.