విజయవాడలో కొత్త తరహా ఆన్ లైన్ మోసం జరిగింది. సైబర్ మోసానికి పాల్పడ్డ ఓ వ్యక్తి..ఆన్ లైన్ మాధ్యమంగా యువతి బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉన్న ఫోన్ నంబర్ ను మార్చాడు. ఆపై ఆమె ఖాతా సంఖ్య, కార్డు వివరాలతో డబ్బును పేటీఎంలోకి ట్వాన్స్ ఫర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ యువతి తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 3 లక్షలు పోగొట్టుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విషయం తెలుసుకున్న బాధితురాలు విజయవాడ  సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితుడు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి అని గుర్తించామని.. అతని పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.


బాధితురాలికి పరిచయమైన వ్యక్తే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా  ఇలాంటి నేరాల విషయంలో జనాలు అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.