హైదరాబాద్: అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా తనదైన శైలిలో స్పందించారు. రామ జన్మభూమిపై సుప్రీం కోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు భారత న్యాయ వ్యవస్థ అతులిత మేధాసంపత్తిని ప్రతిబింబిస్తోందని పవన్ అభిప్రాయపడ్డారు. ''ధర్మాన్నినిలబెట్టినందుకు భారత పౌరులైన మనమందరం సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలియజేయాలి'' అంటూ పవన్ ట్వీట్ చేశారు.