Pawan Kalyan Rally: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నేడు జరగనున్న మత్స్యకార అభ్యున్నతి సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి నర్సాపురంకు ర్యాలీగా బయలుదేరారు. విమానాశ్రయంలో జనసేన పార్టీ కార్యక్రర్తలు, ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోడ్డు మార్గంలో రావులపాలెం, సిద్ధాంతం, పాలకొల్లు మీదుగా ర్యాలీగా పవన్ కల్యాణ్ నర్సాపురం చేరుకోనున్నారు. అయితే ఈ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీలో పవన్ తన కారుపై నిల్చొని ప్రజలకు అభివాదం చేయబోయారు. ఆ క్రమంలో ఓ అభిమాని తన అత్యుత్సాహంతో పవన్ ను ఇబ్బంది పెట్టాడు. 


కారు నిల్చొని ఉన్న పవన్ కల్యాణ్ ను హత్తుకునేందుకు అభిమాని వెళ్లగా.. అంతలో అతడ్ని గమనించిన బాడీగార్డులు ఆ వ్యక్తిని వెనక్కి లాగారు. ఈ తోపులాటలో కారు నిల్చున్న పవన్ కల్యాణ్ ఒక్కసారిగా కింద పడిపోయారు. అయితే ఈ ఘటనలో పవన్ కల్యాణ్ కు గాయలేవి కాకపోవడం వల్ల ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.  



Also Read: Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు!


Also Read: Govindananda Saraswati: 'TTD దైవ‌ద్రోహం చేస్తోంది'.. గోవిందానంద సరస్వతి షాకింగ్ కామెంట్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook