విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ క్రమంలో దాడిని ఖండిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు . ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జగన్ పై జరిగిన దాడి అమానుషమన్నారు. ఈ దాడిని తీవ్రమైందిగా తమ పార్టీ భావిస్తోందన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేయాల్సిన అవసరముందని..కుట్రదారులను కఠినంగా శిక్షించాలి పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. అలాగే గాయం నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ప్రకటనలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.