ఏపీ స్పెషల్ స్టేషస్ కోసం ఢిల్లీ వీధుల్లో రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాల ఆందోళన కొనసాగుతోంది. విభజన హామీల కోసం రెండు రోజులగా పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఏపీ ఎంపీలు గట్టిగా నిలదీస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఎంపీల ధర్న చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ స్ట్రీట్ లో ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద వైసీపీ నేతలు ఆందోళన కొనసాస్తున్నారు. ప్రజా సంఘాలు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడంతో ప్రత్యేక హోదా సెగ ఢిల్లీ పెద్దలకు తాకింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు తమ పోరాటం కొసాగిస్తామని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలా నేతలు తేల్చి చెప్పారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.