విశాఖపట్నం: రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మంగళవారం కొమరాడలో 8, కడపలో 6సెం.మీ. వర్షపాతం నమోదైంది. బుధవారం అధిక ప్రాంతాల్లో మేఘావృతమై వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 


ఇక తెలంగాణలో గత 24 గంటల్లో ఎక్కడా పెద్దగా వర్షపాతం నమోదు కాలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక వెల్లడించింది.