Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతు పవనాలు బలపడ్డాయి. వీటి ప్రభావంతో జోరుగా వానలు పడుతున్నాయి. రుతు పవనాలకు ఉపరితల ద్రోణి తోడు అయ్యింది. దీంతో మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. దక్షిణ కోస్తాంధ్రలో ఇంచు మించు వాతావరణం ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.


ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంది. రుతుపవనాలతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. రాగల మూడురోజులపాటు ఇదే పరిస్థితి ఉండనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తంగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి.


Also read: Monsoon Diet Tips: వర్షకాలంలో ఇలాంటి ఆహారం అస్సలు తీసుకోకండి.. అంతేకాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి..!


Also read:Target Modi: ఆ మూడు రోజులు హైదరాబాద్ గులాబీ మయం! ప్రధాని మోడీకి కేసీఆర్ మార్క్ స్వాగతం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి