Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి పవనాలు, ద్రోణి ప్రభావంతో విస్తారంగా పడుతున్నాయి. రాగల మూడురోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని  దక్షిణ ఒడిశా తీరం వరకు తూర్పు పడమర ద్రోణి కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు కింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు..అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉండనుంది.


ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు క్రమంగా బలపడుతున్నాయి. వీటికితోడు ఉపరితల ద్రోణి కేంద్రీకృతమైంది. దీంతో రాగల మూడురోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు దండికొడుతున్నాయి.



Also read: Viral Video: కనువిందు చేస్తున్న కుక్కల ప్లేయింగ్..ఫిదా అవుతున్న నెటిజన్లు..!


Also read: Indian Vice Presidential Election-2022: ఉపరాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా..ఆగస్టు 6న ఓటింగ్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి