విజయవాడ: టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య నేడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని పవన్ కల్యాణ్ స్వగృహానికి వెళ్లిన టీడీపీ నేతలు.. ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టనున్న దీక్షకు జనసేన నుంచి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.