Nandamuri Balakrishna: కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. వీఐపీలు, సెలబెట్రీలను కలవర పెడుతోంది. ఫస్ట్, సెకండ్‌, థర్డ్‌ వేవ్‌లో ఎంతో మంది వైరస్‌ బారినపడ్డారు. కొందరు కరోనా వారియర్‌గా నిలవగా..మరికొందరూ ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. రోజువారి కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈక్రమంలో తాజాగా ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గత రెండుమూడు రోజులుగా తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని..పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. తనను కలిసి ప్రతి ఒక్కరూ టెస్ట్‌ చేసుకోవాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే కోలుకుని సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆశాభావం తెలిపారు.


అఖండ విజయంతో బాలకృష్ణ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈమూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటిస్తోంది. ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి మూవీ చేయనున్నారు. ఇందులో 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనితోపాటు ఓటీటీలో ఓ ప్రొగ్రామ్‌కు వ్యాఖ్యతగా ఉన్నారు.


 


Also read:Maharashtra Political Crisis: విలాసవంతమైన హోటల్‌లో రెబల్స్‌..ఖర్చు వివరాలు తెలిస్తే షాకే..!


Also read:Karate Kalyani on Ram Gopal Varma : శ్రీకాంత్ రెడ్డి ట్రీట్మెంట్ వర్మకు కూడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.