దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్థంతి సందర్భంగా  టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా  ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.  వైఎస్‌ఆర్ మాస్ లీడర్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. నిస్సంహందేహంగా  తన పాలనతో లక్షలాది మంది ఆంధ్రులతో పాటు దక్షిణ భారతీయులపై వైఎస్ఆర్ ప్రభావం చూపారని కితాబిచ్చారు.  కాంగ్రెస్ ఐకాన్ గా నిలిచిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్పవారసత్వాన్ని విడిచిపెట్టి వెళ్లారని వ్యాఖ్యానించారు. వైఎఆర్ కాంగ్రెస్ పై నిరంతరం విచుకుపడే  టీడీపీ యవనేత రామ్మోహన్ నాముడు తన శైలికి భిన్నంగా మాట్లాడటం చర్చనీయంశంగా మారింది.