హైదరాబాద్: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికే టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ తెలంగాణ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆదివారం టీడీపి అభ్యర్థి పేరును టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారని రావుల చెప్పారు. శనివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో పార్టీ నేతలతో భేటీ అయిన అనంతరమే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోగా.. భేటీ అనంతరం రావుల  చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. 


ఉమ్మడి నల్లగొండ జిల్లాతో టీడీపీకి అవినాభావ సంబంధం ఉందన్న రావుల.. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే హుజూర్‌నగర్‌లో పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారని తెలిపారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికను టీడీపి ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పిన రావుల.. టీడీపి అభ్యర్థి సోమవారం నామినేషన్ దాఖలు చేస్తారని స్పష్టంచేశారు.