తిరుపతి: తిరుపతిలో మూడు పురాతన కిరీటాలు అదృశ్యం అవడం టీటీడీ వర్గాల్లో కలకలం సృష్టించింది. శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయమైన ఉదంతం శనివారం రాత్రి వెలుగుచూసింది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే ఆలయ అర్చకులు టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. టీటీడీ అధికారుల ఫిర్యాదుతో ఆలయానికి చేరుకున్న పోలీసులు ప్రధాన ద్వారాన్ని మూసేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌ టీమ్‌ సైతం ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాయి.