తిరుమలలోని శ్రీవారి భక్తుల కోసం ఏర్పాటు చేసి అశ్విని ఆస్పత్రిని ఈ రోజు టీడీపీ ఛైర్మన్ సుబ్బారెడ్డి పరిశీలించారు. రోగులకు అందుతున్న సౌకర్యాలు, వైద్యం సదుపాయాలు వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరుమలలోని డప్పింగ్ యార్డును పరిశీలించిన సుబ్బారెడ్డి అక్కడ చెత్తను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


ఈ సందర్భంగా  టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  మీడియాతో మాట్లాడుతూ రానున్న మూడు నెల్లలో తిరుమలలోని అశ్వినీ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రోగులు ప్రాణాలు కాపాడేందుకు అన్ని రకాలు వైద్య సహాయం అందిస్తామన్నారు. అలాగే తిరుమలోని డంపింగ్ యార్డులోని సమస్య తర్వలోనే పరిష్కారం చూపుతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు