తిరుమల: జూన్ నెలలో తిరుపతికి భారీ సంఖ్యలో పోటెత్తిన భక్తులు అంతే భారీ మొత్తంలో దేవాలయానికి కానుకలు సమర్పించారు. ఫలితంగా ఒక్క జూన్ నెలలోనే శ్రీవారి హూండీ ఆదాయం రూ.100కోట్లు దాటింది. జూన్‌ నెలలో 24.66 లక్షల మంది భక్తులు ఆ ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. జూన్‌లో భక్తులు శ్రీవారికి వివిధ రూపాల్లో సమర్పించిన ఆదాయాన్ని లెక్కిస్తే, రూ.100.37కోట్లుగా తేలింది.


గతేడాది జూన్‌లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.91.81 కోట్లుగా నమోదైంది. ఒక్క నెలలోనే రూ.100 కోట్ల మార్క్ దాటడం అనేది ఓ సరికొత్త రికార్డుగానే టీటీడీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.