అమరావతి: వంగవీటి రాధాకృష్ణ ఇవాళ టిడిపిలో చేరారు. ఉండవల్లిలోని తన నివాసంలో టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు తెలుగు దేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వంగవీటి కుటుంబానికి విజయవాడతోపాటు కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉండటంతో ఆయనకు అక్కడి నుంచి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయంలో ఇంకా స్పష్టత లభించాల్సి ఉంది. 


వంగవీటి రాధా టిడిపిలో చేరిన సందర్భంగా ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తలు భారీ సంఖ్యలో చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. దీంతో అక్కడ చాలా సందడి వాతావరణం కనిపించింది.