విశాఖపట్టణంలో శనివారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన మొదట 'వాక్ థాన్' ను వైజాగ్ బీచ్ రోడ్డులో ప్రారంభిస్తారు. తరువాత ఆయన చేపలుప్పాడలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'వాక్ థాన్' ప్రారంభించిన ఉపరాష్ట్రపతి


ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల 'వాక్ థాన్' ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వైజాగ్ బీచ్ రోడ్డులో ప్రారంభించారు. విశేషమేమిటంటే..వెంకయ్య నాయుడు కూడా ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థే. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ నగర పాలక సంస్థ అధికారులు, యూనివర్సిటీ ఆచార్యులు, పూర్వ విద్యార్థులు, యువత పాల్గొన్నారు. 


నేడు చేపలుప్పాడలో పర్యటన


వైజాగ్ పర్యటనలో భాగంగా వెంకయ్యనాయుడు చేపలుప్పాడ గ్రామాన్ని సందర్శిస్తారు. ఆ గ్రామంలో జరగనున్న పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు.