బెజవాడలో ఓటర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈవీఎంలు మోరాయించడంతో అసహనానికి గురైన ఓటర్లు ఏకంగా పోలింగ్ బూత్ కు తాళం వేశారు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో అధికారులు తలలు పట్టుకున్నారు. నగరంలోని మొగల్రాజపురం 4వ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈవీఎం మిషన్లు మొరాయించడంతో ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కాలేదు. ప్రిసైడింగ్ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించినా.... సకాలంలో ఆల్టర్‌నేట్ ఈవీఎంలు పోలింగ్ బూత్ కు చేరలేదు. ఉదయం 7 గంటల నుంచి గంటల తరపడి వేచి విసిగి పోయిన ఓటర్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 


తాజా ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ పోలింగ్ కేంద్రానికి కొత్త ఈవీఎం మెషీన్లను పంపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అవసరమైతే సాయంత్రం మరో గంట పాటు పోలింగ్ సమయాన్ని పెంచుతామని అధికారులు ప్రకటించారు.