పులివెందుల: ఏపీలో నేడు తొలి విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలకు నేడే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతంగా ముద్రపడిన పులివెందులలో ఉదయం నుంచే ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడం విశేషం. పులివెందులలోని 134వ పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు క్యూలో నిల్చుండటాన్ని ఈ ఫోటోల్లో గమనించవచ్చు.