జీఈఎస్ సదస్సు హైదరాబాద్‌లో జరుగుతున్న క్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు జరుగుతున్న హెచ్‌ఐసిసి కన్వెన్షన్‌ సెంటర్‌ టీడీపీ హయాంలోనే కట్టారన్న విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదని తెలిపారు. అలాగే ఉమ్మడి రాష్ట్రానికి తాను సీఎంగా ఉన్నప్పుడే భాగ్యనగరానికి  కేంద్రంతో పోరాడి మరీ మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరయ్యేలా చేశామని ఆయన గుర్తుచేశారు.


చరిత్ర ఒకరు చెరిపేస్తే చెరిగిపోయేది కాదని ఆయన తెలిపారు. హైదరాబాద్  డెవలప్‌‌మెంట్‌లో టీడీపీ పాత్ర ఏమిటో ఒకరు మర్చిపోతే మర్చిపోయేది కాదని" ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు వంటివాటికి శ్రీకారం చుట్టింది కూడా ఏపీ ప్రభుత్వమే అని చంద్రబాబు తెలిపారు.