జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం హైదరాబాదులోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ మాటలు అన్నారు. పూర్తిస్థాయి ప్లానింగ్‌తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రాస్ రూట్ లెవల్  నుండి రాష్ట్ర స్థాయి సమస్యల వరకు పోరాడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనసేన పార్టీ పొలిటికల్ ప్లానర్ దేవ్‌ను ఆయన తన పార్టీ వాలంటీర్లకు ఈ సందర్భంగా పరిచయం చేశారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. జరిగాక కూడా దేవ్ సేవలు జనసేనకి అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జనసేన వేస్తున్న అడుగు తొలి రాజకీయ అడుగు కాదని.. తమ పార్టీ కార్యకర్తలకు రెండు ఎన్నికలకు సంబంధించిన అనుభవం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.