ఆంధ్రప్రదేశ్‌కి లక్ష ఎలక్ట్రిక్‌ వాహనాలు తీసుకువస్తామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులతో ఏపీ సర్కార్ పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. తాజాగా సీఐఐ (CII) సదస్సులో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఈ వివరాలు వెల్లడించారు. 


ఎలక్ట్రిక్‌ వాహనాల కారణంగా కాలుష్యాన్ని భారీగా తగ్గించవచ్చన్న సీఎం.. రాష్ట్రంలో సోలార్‌, పవన విద్యుత్‌కు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టంచేశారు. అంతేకాకుండా ఈ ఎలక్ర్టిక్ వాహనాలతో రాష్ట్రంలో పర్యాటక రంగం సైతం అభివృద్ధి చెందుతుంది అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.