వైసీపీ నుంచి ఎంపీ బుట్టారేణుక టీడీపీలోకి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడస్తోంది.  విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం..  వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటు రేణును కాదని..వేరొకరికి రంగంలోకి దించాలని వైసీపీ భావిస్తోంది. తాజా పరిణమాలను గమనించిన సిట్టింగ్ ఎంపీ రేణుక గత కొన్ని రోజుల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ఆమె పార్టీ వీడుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో  వైసీపీ అధినేత జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సందర్భంలో ఆమె  సందర్భంగా కర్నూలు ఎంపీ సీటుపై రేణుక స్పష్టత కోరినట్టు సమాచారం. స్పందించిన జగన్ ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీనికి నిరాకరించిన రేణుక తాను లోక్‌సభకే పోటీ చేస్తానని జగన్‌కు తేల్చి చెప్పారు. ఈ విషయంలో అధినేత నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రేణుక జగన్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువ కప్పుకున్నారు.