అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించిన తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. మే 30న వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవం చేస్తారని వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైఎస్సార్సీపీ 150 స్థానాల్లో ముందంజలో వుండటంపై ఆ పార్టీ అగ్రనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై వున్న విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలించే బాధ్యతను ప్రజలే ఆయన చేతుల్లో పెట్టారని అన్నారు. ఇంతకాలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు దోచుకున్న తీరు చూసే ఏపీ ప్రజలు ఈసారి ఆయనను పక్కనపెట్టారని అభిప్రాయపడ్డారు.