Air India Republic Day sale: మరికొద్ది రోజుల్లో దేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా పలు కంపెనీలు భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా కూడా మంచి ఆఫర్‌ను ప్రకటించింది. తక్కువ ధరలకే విమాన ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా దేశీయ నెట్‌వర్క్‌లో విమాన టిక్కెట్లపై ఆఫర్లను ప్రారంభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎయిర్ ఇండియా అందిస్తున్న ఈ ఆఫర్ ఈ నెల 23వ తేదీ వరకు చెల్లుబాటు అవుతుంది. రేపటిలోపు టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు.. తక్కువ ధరలకే ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ కింద టిక్కెట్లు ఎయిర్‌లైన్ అధీకృత ట్రావెల్ ఏజెంట్లతో సహా అన్ని ఎయిర్ ఇండియా బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్‌లో డొమెస్టిక్ విమానాల టిక్కెట్లను కంపెనీ తక్కువ ధరకే ప్రజలకు అందించనుంది.


ఈ తగ్గింపు టిక్కెట్లు ఎకానమీ క్లాస్‌లో అందుబాటులో ఉంటాయని.. ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశీయ నెట్‌వర్క్‌లో ప్రయాణానికి వర్తిస్తుందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. రూ.1705 కంటే తక్కువ వన్ వే ఛార్జీల నుంచి ధర ప్రారంభమవుతుందని పేర్కొంది. 49 కంటే ఎక్కువ దేశీయ గమ్యస్థానాలకు ఈ ఆఫర్ కింద ప్రజలు తగ్గింపు ధరతో టికెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. 


ఎయిర్ ఇండియా ఆఫర్ ఇలా..


- ఢిల్లీ టు ముంబై- రూ.5.075
- చెన్నై నుంచి ఢిల్లీ- రూ.5,895
- బెంగళూరు నుంచి ముంబై- రూ.2,319
- ఢిల్లీ నుంచి ఉదయపూర్- రూ 3,680
- ఢిల్లీ నుంచి గోవా వరకు- రూ 5,656
- ఢిల్లీ నుంచి శ్రీనగర్- రూ.3,730
- అహ్మదాబాద్ నుంచి ముంబై- రూ.1,806
- గోవా నుండి ముంబై- రూ.2,830
- దిమాపూర్ నుంచి గౌహతి- రూ.1,783


Also Read: Rohit Sharma: గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన బాలుడు.. రోహిత్ శర్మ చెప్పిన ఆ ఒక్క మాటతో..


Also Read:  Smita Sabharwal: సీఎంవో అధికారిని స్మితా సబర్వాల్ ఇంట్లోకి దూరిన డిప్యూటీ తహసీల్దార్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook