Gold Price Today 6 September 2022: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఒక రోజు పసిడి ధర పెరిగితే మరో రోజు తగ్గుతుంది.. ఇంకో రోజు స్థిరంగా ఉంటుంది.కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ,  డాలర్ విలువ, పలు దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. పసిడికి భారత మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పండగ, పెళ్లిళ్ల సీజన్‌లో అయితే బంగారం షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. బంగారం ధరలు ఎంత పెరిగినా లేదా తగ్గినా.. వ్యాపారాలు మాత్రం జోరుగానే సాగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజులుగా బంగారం ధర హెచ్చు, తగ్గులకు లోనవుతున్న విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధర.. నేడు పెరిగింది. మంగళవారం (సెప్టెంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,750లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 100.. 24 క్యారెట్ల ధరపై రూ. 110 పెరిగింది. దేశంలోని ప్రధాన పట్టణాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 


# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,160గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,000గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,360గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,660 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,800గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,050గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,000గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,000గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,750.. 24 క్యారెట్ల ధర రూ. 51,000గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,000 వద్ద కొనసాగుతోంది. 


బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 53,220లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధర రూ. 720 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 53,220లుగా ఉండగా.. చెన్నైలో రూ. 58,500లుగా ఉంది. బెంగళూరులో రూ. 58,500గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 58,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 58,500ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రాశుల వారికి అధిక ధన వ్యయం తప్పదు!


Also Read: Asia Cup 2022: దినేష్‌ కార్తీక్‌ను ఆడించాల్సి ఉంది..భారత మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook