Petrol Diesel Price Hike: ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై మరో 80 పైసల అదనపు భారాన్ని మోపుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గత 12 రోజులుగా ఇంధన ధరలను పెంచడం ఇది 11వ సారి. ఈ క్రమంలో గత 12 రోజులుగా పెట్రోల్, డీజిల్ పై రూ. 7.20 వరకు ధరలను పెంచారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 80 పైసలు పెంపు తర్వాత లీటర్ పెట్రోల్ రూ. 102.61కి చేరుకోగా.. డీజిల్ ధర రూ. 93.87గా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్, డీజిల్ పై 85 పైసల చొప్పున పెంచినట్లు తెలుస్తోంది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.57 ఉండగా.. డీజిల్ ధర రూ. 101.79 వద్దకు చేరుకుంది.  


తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు


తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ పై అత్యధికంగా 90 పైసలు.. డీజిల్ పై 87 పైసలు పెరిగింది. •దీంతో లీటర్ పెట్రోల్ రూ. 116.30కి చేరుకోగా.. డీజిల్ ధర రూ. 102.43 గా ఉంది. 


మరోవైపు అమరావతి పరిసరప్రాంతమైన గుంటూరులో లీటర్ పెట్రోల్ పై 88 పైసలు పెంపుతో రూ. 118.2కు చేరుకుంది. డీజిల్ పై 84 పైసలు పెంపుతో లీటర్ ను రూ. 103.94 కు విక్రయిస్తున్నారు.  


Also Read: Todays Gold: మళ్లీ పెరిగిన బంగారం, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు


Also Read: Whatsapp Ban Accounts: 14.26 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించిన వాట్సాప్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook